వేటి గురించో: కెసిఆర్కు నిన్నమంత్రి దేవినేని.. నేడు ఏపీ కలెక్టర్ షాక్
ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలలోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి కలిపే పరిస్థితి లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ బుధవారం నాడు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీలో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
లండన్, బహ్రెయిన్లలో కెసిఆర్ బర్త్డే వేడుక(పిక్చర్స్)
ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కుకునూరు, వేలేరుపాడు మండలాలలోని గ్రామాల్లో ఈ విషయమై మంగళవారం చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ఏ సందర్భంలో ఏ గ్రామాల గురించి ప్రకటన చేశారో తమకు తెలియదని, పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన గ్రామాలు మాత్రం తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మంగళవారం నాడు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఇదే చెప్పారు. ఏపీలో కలిపిన ముంపు మండలాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదన ఏదీ తాము చేయలేదన్నారు.