బీజేపీలో జగన్ కోవర్టులు ! రఘురామ బాటలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ షాకింగ్..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకాలు దాదాపుగా పూర్తి కావడంతో ఇక ప్రచారంపై దృష్టిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు ఈసారి టికెట్ రాకపోవడంపై చేసిన వ్యాఖ్యలతో నాగేశ్వరరావు వ్యాఖ్యలు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి.
రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే దాదాపుగా టికెట్ల పంపకాలు పూర్తి చేసేశాయి. అయితే ఇందులో రఘురామకు టికెట్ రాకపోవడంతో బీజేపీలో ఉన్న సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. దీనిపై బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ పోస్టు పెట్టారు.

బీజేపీలో కొందరు నేతలు టీడీపీని, ఆ పార్టీలో అగ్రనేతల్ని విమర్శిస్తూనే ఉంటారని, అలాగే బీజేపీలో చాలా మంది వైఎస్ జగన్ కోవర్టులు ఉన్నారని అందరికీ తెలిసిందేనని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. వీరంతా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ.. టీడీపీ, జనసేనతో ఎన్నికల పొత్తులోకి వెళ్లిందని, కానీ జగన్ తో ఇంత లోతైన బంధాలు తెంచుకుని పార్టీ కోసం ఆయా నేతలు పనిచేస్తారా అని ప్రశ్నించారు.
Till the other day the @BJPLive leaders/cadre in AP have been very critical of @JaiTDP and its top leadership.
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) March 25, 2024
It is also not a secret that many leaders of @BJP4Andhra have been coverts of Y S Jagan and they work(ed) against @ncbn and @iTDP_Official sometimes even going to the… pic.twitter.com/hBca84aeiK
కానీ ఎన్డీయే ఏపీలో మెజార్టీ అసెంబ్లీ, లోక్ సభ సీట్లు సాధించాలంటే మాత్రం కేంద్ర నాయకత్వంలోని మోడీ, అమిత్ షా, నడ్డా జోక్యం చేసుకుని పార్టీలో కోవర్టుల్ని, జగన్ అనుకూల కుట్రదారుల్ని బీజేపీ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలని హెచ్చరించాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. అప్పుడే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయేకి మెజార్టీ సీట్లు వస్తాయన్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications