ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 'కేఏ పాల్' ఏమన్నారో విన్నారా?, అమెరికా ఎన్నికలపై జోస్యం
విజయవాడ : సీరియస్ పాలిటిక్స్ లో.. సిల్లీ ఎంట్రీలా మిగిలిపోయింది ప్రముఖ క్రైస్తవ మతగురువు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ. అసలా పార్టీ ఒకటుందన్న విషయం జనంతో పాటు ఆయన కూడా మరిచిపోయి చాలా కాలమే అయిందనిపిస్తోంది. మరి చాలా గ్యాప్ వచ్చిందనుకున్నారో.. ఏమో.. మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లోకి ఎక్కారు కేఏ పాల్.
'ప్రపంచ యుద్దాలను ఆపాను, కష్టార్జితంతో ఏపీని ఆదుకున్నాను..' అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్ జనంలో ఆయన ఇమేజీని చులకన చేశాయి. కూరల్లో కరివేపాకును తీసేసినట్లు.. ప్రధాని స్రవంతి మీడియా ఆయన చేసే వ్యాఖ్యలను వార్తలకు దూరం పెట్టేసింది. దీనికి తోడు సోదరుడి హత్య కేసు కూడా వెంటాడడంతో.. కేఏ పాల్ ఇమేజీకి మరింత దెబ్బ పడింది.

ఇదంతా పక్కనబెడితే, ఎప్పుడు మాట్లాడారో.. ఎక్కడ మాట్లాడారో తెలియదు గానీ.. మరోసారి కేఏ పాల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాలోకి ఎక్కాయి. తాజాగా అమెరికన్ ఎన్నికల మీద కేఏ పాల్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. హిల్లరీ ఓటు వేయవద్దంటూ ట్రంప్ కు అనుకూలంగా కేఏ పాల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులకు హిల్లరీయే కారణమని, కాబట్టి అమెరికన్లంతా ఆమెకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.
అంతేకాదు, నవంబర్ 8న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దే విజయమని జోస్యం కూడా చెప్పారు పాల్. ట్రంప్ కు ఓటేయడం ఇష్టం లేనివాళ్లు ఇంట్లో కూర్చోవాలని అంతేగానీ హిల్లరీకి ఓటేయవద్దని సూచించారు. ఇక పనిలో పనిగా ప్రపంచ రాజకీయాలను గతంలో తానే శాసించినట్లుగా మరో కామెంట్ చేశారు. మరి కేఏ పాల్ తాజా వ్యాఖ్యలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో!
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications