తొలి సవాల్లో అఖిలప్రియ గెలిచారు కానీ, బాబును మెప్పించలేకపోయారు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరోగమనం ప్రారంభమైందా? అంటే కాదనలేం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరోగమనం ప్రారంభమైందా? అంటే కాదనలేం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
Recommended Video
అఖిలప్రియ పనితీరుపై చాలాకాలంగా అసంతృప్తి ఉన్నప్పటికీ ఇటీవల చంద్రబాబు ఆమెపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత సహనం నశిస్తే తప్ప ఆయన అలా మండిపడరని భావిస్తున్నారు. చూస్తుంటే అఖిలకు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయని అంటున్నారు.
షాక్ మీద షాక్: అంత మాటా? బాబుకు చిక్కులు తెచ్చిన లోకేష్, పోసాని ఆగ్రహం వెనుక
అఖిలప్రియ తన సామర్థ్యం నిరూపించుకుంటే
అయితే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే తిరిగి ఆయన నుంచి ప్రశంసలు కూడా వస్తాయని అంటున్నారు. అంటే ముందు ముందు టీడీపీలో అఖిలప్రియ పాత్ర ఏమిటనేది ఇప్పుడు ఆమె నిరూపించుకోవడాన్ని బట్టి ఉంటుందని చెబుతున్నారు.
కేడర్ను కాపాడుకునే దానిని బట్టి భవిష్యత్తు
భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ వైసీపీ నుంచి చేరడంతో చంద్రబాబు.. భూమా అనుభవానికి, ఆయనకు ఉన్న పట్టుకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చు. కానీ అఖిలప్రియ తన కేడర్ను కాపాడుకునే దానిని బట్టి కూడా ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
తొలి సవాల్లో గెలిచారు కానీ
టీడీపీలో చేరి, మంత్రి అయిన తర్వాత అఖిలప్రియ ఎదుర్కొన్న తొలి ప్రధానమైన సవాల్ నంద్యాల ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భూమా బ్రహ్మానంద రెడ్డిని అఖిల గెలిపించుకున్నారు. తద్వారా జగన్కు, తమ రాజకీయ ప్రత్యర్థి శిల్పాకు షాకిచ్చారు. దీంతో ఆమెను నంద్యాల జేజమ్మగా అభిమానులు ప్రశంసించారు.
అక్కడ గెలిచారు కానీ
అరుంధతి సినిమా పోస్టర్లా అఖిలప్రియ పోస్టర్లతో అభిమానులు బయట, సోషల్ మీడియాలోను ప్రచారం చేశారు. అయితే, మంత్రిగా మాత్రం ఆమె చంద్రబాబు మన్ననలు అందుకోలేకపోతున్నారు. గతంలోను ఒకటి రెండుసార్లు ఆమె పనితీరుపై అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు.
నంద్యాల తుడిచిపెట్టుకుపోయింది
ఇటీవల పడవ బోల్తా ఘటనను ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. దీంతో ఆమెపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని బాగా ప్రచారం జరగడంతో మంత్రి నారా లోకేష్.. అఖిలప్రియను ప్రశంసించారు. నంద్యాల గెలుపులో ఎవరి పాత్ర ఏమైనా.. క్రెడిట్ ఎక్కువగా అఖిల ఖాతాలో పడింది. కానీ మంత్రిగా వైఫల్యాలతో బాబు వద్ద ఆ గెలుపు తుడిచిపెట్టుకుపోయిందంటున్నారు.
లోకేష్ ప్రశంసించారు కానీ
లోకేష్ ప్రస్తుతానికి ప్రశంసించినా మంత్రిగా తన పనితీరుతో చంద్రబాబును ఆమె మెప్పించాల్సి ఉంటుందని అంటున్నారు. అప్పుడు ఆమెకు పార్టీలో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని, చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ఆమెను గుర్తిస్తారని చెబుతున్నారు.