మా ప్రయత్నాలకు సహకరించండి: చంద్రబాబుకు అఖిలేష్ యాదవ్ ఫోన్
లక్నో/అమరావతి: బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి పలువురు జాతీయ నేతలను కలిసిన విషయం తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలిసిన విషయం తెలిసిందే.
తాజాగా మంగళవారం యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. ఆయన చంద్రబాబుతో పలు అంశాలపై చర్చిందారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన అఖిలేష్ బీజీపేయేతర భావజాలమున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు.

ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వాదం ప్రమాదంలో పడ్డాయని వాటికి కాపాడని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగేళ్లలోనే ఏపీ బాగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అభద్రతా భావం పెరిగిందన్నారు. టీడీపీ ప్రయత్నాలకు సహకరించాలని కోరగా అఖిలేష్ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications