తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంలో మార్పు !
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీవారిమెట్టు మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు శ్రీవారిమెట్టులో ఉన్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్కు తరలించినట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ కొత్త కౌంటర్లు జూన్ 6, 2025 (శుక్రవారం) సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్ల లభ్యత ఉంటుంది.

భక్తులకు గమనిక..
దివ్యదర్శనం టోకెన్లు 'ఫస్ట్ కమ్ - ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన భూదేవి కాంప్లెక్స్లోనే జారీ చేయబడతాయి.
టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి.
శనివారం దర్శనానికి కావలసిన టోకెన్లు జూన్ 6 సాయంత్రం నుంచే జారీ చేయబడతాయి.
స్కానింగ్ ప్రక్రియ తప్పనిసరి
టోకెన్ పొందిన భక్తులు, శ్రీవారిమెట్టు మార్గంలో 1,200వ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రంలో తమ టోకెన్ను స్కాన్ చేయించుకోవాలి. స్కానింగ్ తర్వాతే భక్తులు దర్శనానికి అనుమతించబడతారు. అలానే సర్వదర్శనం టోకెన్లకు కూడా అదే ప్రక్రియ కొనసాగనుంది. ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లోనే వాటిని కూడా జారీ చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications