ఎపిలో...ఎంసెట్తో సహా వివిధ సెట్ల తేదీలివే....ప్రకటించిన మంత్రి గంటా
అమరావతి: ఎపిలో నిర్వహించనున్న వివిధ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సోమవారం అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి గంటా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు.
రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్ల పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి గంటా ఈ ఎంట్రెన్స్ టెస్ట్ లన్నీఆన్లైన్లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు.

ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని గంటా ప్రకటించారు. అలాగే విశాఖలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరగబోయే వివిధ ఎంట్రెన్స్ సెట్ల పరీక్షల తేదీలు ఇవి..
ఏప్రిల్ 19న ఎడ్సెట్, లాసెట్
ఏప్రిల్ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
ఏప్రిల్ 26న ఏపీ ఎంసెట్ మెడిసిన్ పరీక్ష
మే 2న ఐసెట్
మే 3న ఈసెట్
మే 4న పీయూ సెట్
మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications