అమరావతిలో సకల జనుల సమ్మె: వీధుల్లో రైతుల ర్యాలీ: నోటీసుల కలకలం..!
రాజధాని తరలింపు ప్రతిపాదన పైన అమరావతి రైతులు..స్థానికులు ఆందోళన తీవ్రతరం చేసారు. తెలంగాణ ఉద్యమ తరహాలో అమరావతి గ్రామాల్లో నేటి నుండి సకల జనుల సమ్మెకు దిగారు. జేఏసీ నేతల పిలుపు మేరకు గ్రామాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. దుకా ణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక..వెలగపూడి..మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపుతున్నాయి.

గ్రామాల్లో స్వచ్చంద సమ్మె..
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. సకల జన సమ్మెలో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించాలని యత్నించారు. కాగా దుకాణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసులకు రైతులు గులాబీ పూలు ఇచ్చి, నమస్కారం పెడుతూ నిరసన తెలిపారు. అలాగే పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి, పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రభుత్వం ప్రకటించే వరకూ..
రాజధాని తరలింపు అంటే తమ శావాల మీదుగా తీసుకెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. విశాఖ వాసులు జగన్ను రాజధాని కావాలని అడిగారా అని ప్రశ్నించారు. జగన్ను నమ్మి గెలిపిస్తే తమను నడి వీధిలో నిలబెట్టారని ఆక్రోశం వెల్లగక్కారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. మందడం వీధుల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. రైతులు ప్రతీ ఇంటికి వెళ్లి గులాబీలు అందజేశారు. ఉద్యోగులు, పోలీసులకు గులాబీలు ఇచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సచివాలయం వెళ్లే వైపు రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.

నోటీసులతో కలకలం
వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కేసులు ఉన్నందున పోలీస్స్టేషన్కు రావాలంటూ పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు చిలకలూరి పేట రూరల్ పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సిందిగా వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు పంపారు. దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి. ఇక, సచివాలయం వెళ్లే రోడ్డ వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. వారిని అక్కడ నుండి ధర్నా విరమించాలని పోలీసులు కోరారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!











Click it and Unblock the Notifications