అమరావతిలో సకల జనుల సమ్మె: వీధుల్లో రైతుల ర్యాలీ: నోటీసుల కలకలం..!
రాజధాని తరలింపు ప్రతిపాదన పైన అమరావతి రైతులు..స్థానికులు ఆందోళన తీవ్రతరం చేసారు. తెలంగాణ ఉద్యమ తరహాలో అమరావతి గ్రామాల్లో నేటి నుండి సకల జనుల సమ్మెకు దిగారు. జేఏసీ నేతల పిలుపు మేరకు గ్రామాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. దుకా ణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక..వెలగపూడి..మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపుతున్నాయి.

గ్రామాల్లో స్వచ్చంద సమ్మె..
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. సకల జన సమ్మెలో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించాలని యత్నించారు. కాగా దుకాణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసులకు రైతులు గులాబీ పూలు ఇచ్చి, నమస్కారం పెడుతూ నిరసన తెలిపారు. అలాగే పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి, పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రభుత్వం ప్రకటించే వరకూ..
రాజధాని తరలింపు అంటే తమ శావాల మీదుగా తీసుకెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. విశాఖ వాసులు జగన్ను రాజధాని కావాలని అడిగారా అని ప్రశ్నించారు. జగన్ను నమ్మి గెలిపిస్తే తమను నడి వీధిలో నిలబెట్టారని ఆక్రోశం వెల్లగక్కారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. మందడం వీధుల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. రైతులు ప్రతీ ఇంటికి వెళ్లి గులాబీలు అందజేశారు. ఉద్యోగులు, పోలీసులకు గులాబీలు ఇచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సచివాలయం వెళ్లే వైపు రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.

నోటీసులతో కలకలం
వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కేసులు ఉన్నందున పోలీస్స్టేషన్కు రావాలంటూ పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు చిలకలూరి పేట రూరల్ పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సిందిగా వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు పంపారు. దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి. ఇక, సచివాలయం వెళ్లే రోడ్డ వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. వారిని అక్కడ నుండి ధర్నా విరమించాలని పోలీసులు కోరారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications