'అడ్డగోలుగా ఆంధ్రజ్యోతికి లబ్ధి, అడిగితే చిత్రమైన సమాధానం'
చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్ణయాలను హైకోర్టు అడ్డుకోవడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
Recommended Video
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్ణయాలను హైకోర్టు అడ్డుకోవడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
భూమా
ఎఫెక్ట్:
బెట్టింగుతో
అతను
కోటీశ్వరుడయ్యాడు!!
ఇది ఆహ్వానించదగ్గ పరిణామం
అధికార పార్టీ నేతలపై నమోదైన తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను విచారణ దశలోనే ఎత్తివేస్తూ సర్కార్ ఇచ్చిన జీవోలు, అసెంబ్లీ ప్రసారాలను ఓ ఛానల్కే కట్టబెట్టిన వైనంపై వేసిన పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆళ్ల వ్యాఖ్యానించారు.
ఆ బాధిత కుటుంబాలు ఏమైనా ఫర్వాలేదా
తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావించే చంద్రబాబుకు ఇది చెంపపెట్టు అని ఆళ్ల వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలు ఏమైనా ఫర్వాలేదని, తనవాళ్లపై మాత్రం కేసులు ఎత్తివేయాలన్న చంద్రబాబు చట్ట వ్యతిరేకంగా 132 జీవోలు ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రజ్యోతి వేమూరి తనయుడికి ఇవ్వడమా
అసెంబ్లీ సమావేశాల ప్రసారాలను చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడు ఆదిత్యకు కట్టబెట్టారని ఆళ్ల ధ్వజమెత్తారు. దీని నిబంధనలు ఏమిటని సమాచార హకక్ు చట్టం కింద ప్రశ్నిస్తే తీవ్ర జాప్యం తర్వాత ప్రభుత్వం విచిత్రమైన సమాధానం ఇచ్చిందన్నారు.
అడిగితే విచిత్రమైన సమాధానం
సమయాభావం వల్ల నామినేషన్ పద్ధతిలో టెండర్లు పిలవకుండా అడ్వాన్స్డ్ టెలీ కమ్యూనికేషన్కు స్పీకర్ ఆదేశాల మేరకు 2018 వరకు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం అధికారి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆ సంస్థ ఆదిత్య పేరుపై ఉందని, ఇది రియల్ క్విడ్ ప్రోకో అన్నారు.