బాపట్ల జిల్లాలో వైసీపీకి భారీ షాక్- ఆ కీలక నేత రాజీనామా..!
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోని బాపట్ల జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇప్పటివరకూ కీలక నేతగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడారు. ఈ నెల 9న తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఆమంచి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. అయితే చీరాల నియోజకవర్గం నుంచి ఆయన సీటు ఆశించారు. కానీ జగన్ మాత్రం కరణం వెంకటేష్ కు టికెట్ కేటాయింంచారు. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీకి కీలక సమయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు ఈ నెల 9న అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆమంచి వెల్లడించారు. దీంతో ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే వైైసీపీకి గడ్డు పరిస్ధితలు ఎదురవుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆమంచి కూడా విపక్షంతో చేరితే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications