33వేల ఎకరాలు ఏం చేస్తామో చూడండి... బోత్స సత్యనారాయణ
అమరావతిలో 50 శాతం పూర్తయిన భవనాలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్దిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల అందోళనలు, వారి లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దీంతో రైతులు ఎలాంటీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు ఏం చేస్తామో శుక్రవారం తేలుస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ఆయన ఐదు సంవత్సరాలు సీఎం గా ఉండి అమరావతిలో కనీసం ఇళ్లు కూడ కట్టుకోలేదని విమర్శించారు. దీంతో రాష్ట్ర రాజధాని అభివృద్దిపై ఆయనకు ఎలాంటీ చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇక చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలనే ఆలోచన వైసీపీకి లేదని అన్నారు. రాజధాని నిర్మాణంలో బాధ్యతగా వ్వవహరిస్తున్నామని అన్నారు.

కాగా అమరావతిలో రైతులను మోసం చేయమని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 29 గ్రామాల్లో అభివృద్ది చేయాలని జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసిందని దీంతో ఆ ప్రాంత అభివృద్దిపై రేపటి క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. కాగా రాష్ట్ర ఆదాయం మేరకే రాజధాని నిర్మాణాలపై నిర్ణయం తీసుకున్నామని , రాష్ట్ర బడ్జెట్ను రాజధాని నిర్మాణానికే ఖర్చు పెడితే... సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా, వైద్యం మరియు ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుండి తెస్తామని ఆయన ప్రశ్నించారు. కాగా కేంద్రం కూడ రాజధానిని పూర్తిగా తమ ఖర్చులతో నిర్మిస్తామని విభజన హామీలో కూడ ఎక్కడా చెప్పలేదని బోత్స వివరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications