అలా అయితే సీమకు అన్యాయం: టిజి, 'ఒక పెళ్లికి రెండు సార్లు బాబు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్గా ప్రకటించాలని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టిజి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే రాయలసీమవాళ్లకు, ఉత్తరాంధ్రవాళ్లకు భవిష్యత్తులో అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నం ప్రెస్క్లబ్లో ఆయన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే చంద్రబాబు పర్యటించడం మానేసి ఓ పెళ్లికి రెండు సార్లు హాజరు కావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరువు నెలకొనడంతో బెంగళూరుకు, కేరళకు రైతులు వలసలు పోతున్నారని, దానిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక మాఫియాపై తన మంత్రివర్గంలోని మంత్రులు, పార్లమెంటు సభ్యులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటాయని, దీనిపై ఈ నెల 9వ తేదీన అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications