'అమరావతి ప్రయాణానికి 1080 రోజులు, మరో నయారాయపూర్ కానివ్వం'
Recommended Video

అమరావతి: రాజధాని అమరావతిని హరిత, నీలి నగరంగా నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ గురువారం తెలిపారు. అమరావతి నిర్మాణంపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలకు ఆయన హాజరయ్యారు.
ఈ కార్యశాలలో హ్యాపీ సిటీ విజన్, ప్రభుత్వ భవన సముదాయాలు, మౌలిక సదుపాయాలు, రవాణా, అర్థిక కేంద్రంగా అమరావతి వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు.

అమరావతి ప్రయాణానికి 1080 రోజులు
అమరావతి ప్రయాణం నేటితో 1,080 రోజులకు చేరిందని తెలిపారు. 35 నెలల్లో 50 శాతం నిర్మాణ లక్ష్యాలను చేరుకున్నామని చెప్పారు. డిజైన్లలో చూపినట్లు అమరావతి కనిపించడానికి ఇంకెంతో కాలం పట్టదని చెప్పారు.

దేశానికే బ్రాండ్ నగరంగా
ప్రతిక్షణం, ప్రతిరోజూ రూపును మార్చుకుంటూ అద్భుత నగరం నిర్మితమవుతోందని, అమరావతిని రాష్ట్రానికే కాదు దేశానికే బ్రాండ్ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని శ్రీధర్ తెలిపారు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరులతో పోటీపడుతూ
ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి వాటితో పోటీపడుతూ ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నామని, అమరావతిలో ఇప్పటికే రూ.20వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, ఐకానిక్ భవనాలు నిర్మించాలన్నది తమ కల అని శ్రీధర్ అన్నారు.

అమరావతిని మరో నయా రాయపూర్ చేయదల్చుకోలేదు
నార్మన్ ఫోస్టర్ లాంటి ప్రముఖ ఆర్కిటెక్ట్తో భవనాల ప్రణాళిక చేయించామని, అద్భుతమైన భవనాలుంటేనే ప్రజలు వాటిని చూడటానికి వస్తారని, ఒక్కరోజులో ఏ నగరమూ నిర్మాణం కాలేదని, అమరావతిని మరో నయా రాయ్పూర్ చేయదల్చుకోలేదన్నారు. అందుకే ప్రణాళికకు, నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నామని, అమరావతిని ఆనందమయ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని శ్రీధర్ తెలిపారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త!












Click it and Unblock the Notifications