రంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామా
అమరావతి:ఎన్డీఏ ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆశోక్గజపతి రాజు, సుజనా చౌదరిలు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీనిని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధాన మంత్రి ఫోన్ చేసినా మంత్రుల రాజీనామాల విషయంలో టిడిపి మాత్రం వెనక్కు తగ్గలేదు.ఈ పరిణామాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీశారు. ఏపీకి చెందిన బిజెపి ఇంచార్జీలతో అమిత్ షా చర్చించారు.
Recommended Video

కేంద్రం రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుండి మంత్రులను వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగనున్నట్టు ప్రకటించారు.
గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలనే నిర్ణయం విషయమై బాబుతో మోడీ చర్చించారు. కానీ, బాబు మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. ఈ పరిణామాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టిడిపి నేతలను నిలువరించే ప్రయత్నాలు చేశారు.

రంగంలోకి దిగిన అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గురువారం సాయంత్రం టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధానమంత్రి మోడీని కలిశారు. తమ రాజీనామా పత్రాలను మోడీకి అందించారు. అయితే ఈ విషయమై టిడిపి మంత్రులను కేబినెట్ నుండి వైదొలగకుండా ఉండేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

బిజెపి నేతలతో మాట్లాడిన అమిత్ షా
ఏపీ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న బిజెపి నేతలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లో చర్చించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం త్రిపురలో ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీశారు.

స్వంత వాహనాల్లోనే మోడీ ఇంటికి
రాజీనామాలు సమర్పించేందుకు సుజనా చౌదరి, ఆశోక్ గజపతి రాజులు తమ స్వంత వాహనాల్లోనే మోడీ ఇంటికి బయలు దేరారు. సుమారు అరగంటకు పైగా వారిద్దరూ మోడీతో చర్చించారు. ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలు, విభజన హమీలు అమలు చేయకపోతే చోటు చేసుకొనే పరిణామాలపై మంత్రులిద్దరూ మోడీకి వివరించినట్టు చెప్పారు. మోడీకి తమ రాజీనామా పత్రాలను సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఫోన్ సంభాషణ పూర్తి కాగానే రాజీనామా
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి మోడీ గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. కేంద్రం నుండి వైదొలగాలనే నిర్ణయంపై బాబుతో మోడీ చర్చించారు.ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని మోడీ బాబును కోరినట్టు సమాచారం.అయితే నిర్ణయంలో మార్పుండదని బాబు చెప్పారని సమాచారం. ఈ ఫోన్ సంభాషణ పూర్తైన వెంటనే ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధాని వద్దకు వెళ్ళి రాజీనామా పత్రాలను సమర్పించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications