వచ్చే నెలలో వైసీపీలోకి ఆనం రామనారాయణ, అదే సమయంలో రాంకుమార్
నెల్లూరు: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. వైసీపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తేదీలు కూడా మారుతున్నాయి.
ఇప్పుడు సెప్టెంబర్ 2వ తేదీన వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంలోనే వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కూడా ఉంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఆయన ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు.

మరోవైపు, వచ్చే నెలలోనే నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారు. ఆయన కూడా విశాఖ వేదికగా పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications