'ఆంధ్ర' బాహుబలి చంద్రబాబు: ఆకాశానికెత్తిన తనికెళ్ల భరణి
రాజమండ్రి: సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆకాశానికెత్తారు. చంద్రబాబును ఆయన ఆంధ్ర బాహుబలిగా అభివర్ణించారు. రాజమండ్రిలో శుక్రవారం ఆంద్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటైన సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు వచ్చారు.
చంద్రబాబు వేదిక మీదికి వస్తుండగా తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చంద్రబాబును ఆంధ్ర బాహుబలిగా అభివర్ణించారు. 15 కోట్ల మందికి పైగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు బాహుబలి అని ఆయన అన్నారు. సినిమాలోని బాహుబలి కత్తితో పోరాటం చేయగా ఈ బాహుబలి చంద్రబాబు జ్ఞానంతో యుద్ధం చేస్తున్నారని అన్నారు.

భరణి మాటలు రిథమిక్గా సాగడంతో ఆయన ప్రసంగాన్ని నాయకులు, ఇతర అతిథులు, ప్రేక్షకులు తెగ ఆనందించారు. చంద్రబాబుతో పాటు అందరి ముఖాల్లోనూ నవ్వు విరబూసింది.
తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని ముగించగానే చంద్రబాబు మాట్లాడడం ప్రారంభించారు. బాహుబలి సినిమాను తాను చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. రాజమౌళి అద్భుత ప్రతిభను ప్రదర్శించారని ఆయన కొనియాడారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications