వంద కోట్ల కథ: చంద్రబాబుపై టైమ్స్ నౌ కథనం సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై టైమ్స్ నౌ అనే ఆంగ్ల టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెబుతున్న చంద్రబాబు తన పర్యటనలకు, ఇతరత్రా పనులకు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని ఆ న్యూస్ చానెల్ ఆరోపించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చులకు సంబంధించిన ఆధారాలు, అందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చానెల్ చెప్పుకుంది.
ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ ‘యువర్ మనీ... మై లగ్జరీ' పేరిట చంద్రబాబుపై ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘ఐయామ్ ఏ వీవీఐపీ. యువర్ మనీ ఈజ్ మైన్. వన్ ఇయర్.. 100 క్రోర్. 91 శాతం మంది రైతులు రుణాల్లో కూరుకుపోయారు'' మొదలైన ఉప శీర్షికలతో ప్రసారం చేసిన కథనం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది.

ఏపీపై 1.46 కోట్ల రుణ భారం పడిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్రం వద్ద వాదించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రం సాయం చేస్తే గట్టెక్కలేమని చెబుతున్నారు. ఇతర పక్క రాష్ట్రాలకు సమానంగా ఎపి అభివృద్ధి చెందే వరకు కేంద్రం తమకు సాయం అందించాల్సిందేనని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనపై కేంద్రం వెనకడుగు వేయడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించారు. అయితే, చంద్రబాబుపై టైమ్స్ నౌ విరుచుకుపడింది.
రాష్ట్రం అప్పుల్లో ఉంటే, చంద్రబాబు మాత్రం వీవీఐపీ లగ్జరీని అనుభవిస్తున్నారని, రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోగానే ఆయన తన కోసం దాదాపు రూ.100 కోట్లను ఖర్చు చేశారని వ్యాఖ్యానించింది. దీనిపై పర్యటనలు ప్రత్యేక చార్టర్ విమానాలు, హెలికాప్టర్లు, కాన్వాయ్ లో కొత్త వాహనాలు, విదేశీ పర్యటనల పేరిట ఆయన ఈ వంద కోట్ల రూపాయలను దుబారా చేశారని ఆ ఛానెల్ ఆరోపించింది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications