ఏపీ స్కూల్స్ రీఓపెన్ సెప్టెంబర్ నుంచే: సీఎం జగన్ కీలక ఆదేశాలు
అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. కరోనా నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మెరుగైన విద్య తోపాటు విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం(జగనన్న గోరుముద్ద)పై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
Recommended Video
ఈ సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బంధీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక జాయింట్ డైరెక్టర్ పోస్టు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
పాఠశాలలు ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు
మూడో విడత డ్రైరేషన్ పంపిణీ కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఆన్లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నామని తెలిపారు.

అంతేగాక, ప్రతిఏటా అకాడమిక్ ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రీ ప్రమైరీ ఎడ్యుకేషన్ విధి విధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కడపలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రిసోర్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications