రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు- నాలుగు బిల్లులు, నాలుగు ఆర్డినెన్స్ లు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత సమావేశమైన అసెంబ్లీ, మండలి బీఏసీలు నిర్ణయం తీసుకున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, బడ్జెట్ ప్రసంగాలు ఉండబోతున్నాయి. సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత శాఖల మంత్రులు ఇరు సభల్లోనూ ప్రవేశపెట్టబోతున్నారు.
రేపు నాలుగు కీలక బిల్లులతో పాటు నాలుగు ఆర్డినెన్స్ లను సభ ముందుకు తీసుకు రానున్నారు. ఇందులో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలతో పాటు ద్రవ్య వినిమయ బిల్లు, రాజధానికి సంబంధించిన రెండు బిల్లులు ఉండబోతున్నాయి.

ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఆమోదించిన రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీ పేరుతో జాప్యం చేస్తున్న నేపథ్యంలో మరోసారి వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మండలిలో ఇవే బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. దీంతో రేపటి సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఏపీలో రైతులకు అలర్ట్-ఎన్టీరంగా వ్యవసాయ యూనివర్శిటీ కీలక సూచనలు..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications