ఏపీ రాజధాని: జూఎన్టీఆర్, కృష్ణంరాజుల ముందుచూపు!
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలో ఉంటుందని తెలియడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు ఈ పరిసరాల్లో భూములు కొన్నారు. ఇంకొందరు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు భూములను కొన్నారు.
నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితమే భూములు కొన్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారట. ఇంకొందరు ఇటీవల కొనుగోలు చేశారట. పలువురు ప్రముఖులకు చెందిన భూమిని గన్నవరం విమానాశ్రయం పరిధి విస్తృతి కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశముందట.

సినీ ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, రవితేజ, కృష్ణ, కృష్ణం రాజు, అశ్వినీ దత్ వంటి పలువురు ఇప్పటికే నాగార్జున విశ్వవిద్యాలయం, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారట! పలువురికి పదుల ఏకరాల భూములు ఉన్నాయట. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా భూములను కొనుగోలు చేశారట.
కాగా, గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. రాజధాని అక్కడే ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. మంత్రులు కూడా గుంటూరు - విజయవాడను పల్లె వేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications