మీడియాకు మూడువేల కిలోమీటర్ల దూరంలో వైసీపీ, భయమా?, భయంతో కూడుకున్న!!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి చెక్ పడింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ప్రకటించారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మంగళం పాడేశారు. ఇప్పటికే మంత్రులు పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోవడంతో ఇక సీఎం జగన్ కూడా ఈరోజు, రోపే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చెయ్యనున్నారని తెలిసింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అనే డైలాగ్ చెప్పి ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి నిన్నటి వరకు వైసీపీలోని కొందరు నాయకులు ఎంత రెచ్చిపోయేరో అందరికి తెలిసిందే. వైసీపీలో కొందరు చేసిన పనికి ఆ పార్టీ ఈరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నోటికి అడ్డుఅదుపులేకుండా మాట్లాడిన నేతలను సీఎం జగన్ వెనుకేసుకురావడం, జగన్ దగ్గర మార్కులు కోట్టేయాలని వైసీపీ నాయకులు ఇంతకాలం ఇంకా ఎక్కువ హంగామా చెయ్యడంతో ఆ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

ఇసుక క్వారీలు, మైనింగ్, కాంట్రాక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గతంలో కాంట్రాక్టు పనులు చేసిన చాలా మందికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి బిల్లుకూడా చెయ్యలేదు. చాలా మంది చిన్నాచితక కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కాంట్రాక్టర్లు, వ్యాపారులు వైసీపీ కండువాలు కప్పుకుని వారు చెప్పినట్లు వినే పరిస్థితి ఎదురైయ్యింది.
పదేపదే మీడియా సమావేశాలు పెట్టి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైసీపీ నాయకులు మంగళవారం ఉదయం నుంచి మాయం అయిపోయారు. మీడియా సమావేశం అంటే మూడువేల కిలోమీటర్ల దూరం వెళ్లిపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మీద నోరుపారేసుకున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు వణుకు మొదలైయ్యింది.
టీడీపీ, జనసేన నాయకులను బూతులు తిట్టిన వైసీపీ నాయకులను ఇప్పుడు జగన్ వచ్చి కాపాడుతాడా ?, ఎవరు వచ్చి కాపాడుతారో చూస్తాం అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నోరుపారేసుకున్న మాజీ మంత్రులను ఇప్పుడు ఆ దేవుడు తప్పా ఇంకెవ్వరు కాపాడటానికి లేరని ప్రజలు అంటున్నారు. వైసీపీ నాయకులను మాట్లాడించడానికి మీడియా ప్రయత్నిస్తే ఒక్క నాయకుడు కూడా అడ్రస్ లేకుండాపోయాడు. చేసిన పాపం ఊరికేపోదు అనే సామెత ఇప్పుడు కొందరు వైసీపీ నాయకులకు వర్థిస్తుందని సామాన్య ప్రజలు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications