ఏపీ ఎంపీలు వీరే : వైసీపీ విజయ దుందుబి, 3 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ
అమరావతి : ఏపీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురేసింది. మొత్తం 22 చోట్ల విజయదుందుబి మోగించింది. అధికార టీడీపీ మాత్రం కేవలం 3 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఖాతా తెరవలేదు. విశాఖ నుంచి బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. ఏపీలో వైసీపీ విజయానికి కారణమేంటీ ? టీడీపీ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఏ నేత విజయం సాధించారు. మెజార్టీ ఎవరు సాధించారనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

22 చోట్ల వైసీపీ జయకేతనం
ఏపీలో మొత్తం 25 లోక్సభ సీట్లు ఉండగా 22 చోట్ల వైసీపీ జయకేతనం ఎగరేసింది. టీడీపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన ఖాతా తెరవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అరకు నుంచి వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 2 లక్షల 21 వేల మెజార్టీతో కిశోర్ చంద్రదేవే్పై విజయం సాధించారు. విజయనగరం నుంచి బెల్లాన చంధ్రశేఖర్, విశాఖపట్నం నుంచి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందారు. ఎంవీవీకి టీడీపీ అభ్యర్థి భరత్ గట్టి పోటీనిచ్చారు. కేవలం 3 వేల 111 ఓట్ల తేడాతో ఎంవీవీ విజయం సాధించారు.

వార్ వన్ సైడే ..
అనకాపల్లి నుంచి జీవీ సత్యవతి, కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి చింతా అనురాధ, రాజమండ్రి నుంచి భరత్ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై భరత్ లక్షా 17 వేల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. నరసాపురంలో రఘురామ కృష్ణంరాజు, ఏలూరులో కోటగిరి శ్రీధర్ విక్టరీ కొట్టారు. శ్రీధర్ తన ప్రత్యర్థి మాగంటి బాబుపై లక్షా 61 వేల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. మచిలీటప్నం నుంచి బాలశౌరి, నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి నందిగం సురేశ్, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. మాగుంట తన ప్రత్యర్థి శిద్దా రాఘవరావుపై 2 లక్షల 11 వేల 292 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మాధవ్ గెలిచాడు
నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి శివానంద్ పై 2 లక్షల 43 వేల ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. కర్నూలు నుంచి సంజీవ్ కుమార్, అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ గెలుపొందారు. మాధవ్ తన ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పపై లక్షా 38 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిపై 3 లక్షల 71 వేల ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.ః

3 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ
నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి నుంచి బల్లి దుర్గాప్రసాద్, రాజంపేట నుంచి పీ వీ మిథున్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డప్ప గెలుపొందారు. తన ప్రత్యర్థి శివప్రసాద్ ను లక్షా 34 వేల ఓట్లతో మట్టికరించాడు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ గెలుపొందారు. రామ్మోహన్, నాని, గల్లా జయదేవ్ వరసుగా 8 వేలు 7 వేలు 4 వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications