మెడకు ఉరితాళ్ళతో అంగన్వాడీల ఆందోళన; జగన్ సర్కార్ తో ప్రచ్చన్నయుద్ధం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని అంగన్వాడి కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. అంగన్వాడీల ఆందోళన విరమింపజేయటం కోసం ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదు.
మంత్రి బొత్సా సత్యన్నారాయణ చర్చలు జరిపి మరికొంత సమయం ఇస్తే ఆలోచిస్తామని చెప్పారు. దీనికి అంగన్వాడీలు ససేమిరా అన్నారు. ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైసిపి ఇన్చార్జిల నివాసాలను ముట్టడిస్తున్నారు. అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పింఛన్ అమలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడుతున్నారు. 26 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇంతగా ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్టడి చేస్తున్న అంగన్వాడీలు, తాజాగా రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి కార్యకర్తలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ వినూత్న నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో అంగన్వాడీలు మెడకు చీరలను ఉరి తాళ్లుగా బిగించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం అంగన్వాడీల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ ఇచ్చిన మాట మేరకు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications