బియాస్ విషాదం: నదిలో మరో మృతదేహం వెలికితీత
సిమ్లా/హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో శుక్రవారం మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. హైదరాబాద్ ఏఎస్ రావునగర్కు చెందిన సాయిరాజ్ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, తల్లిదండ్రులతో పోట్లాడి మరీ విహారయాత్రకు వెళ్లిన సాయిరాజ్, చివరకు శవమై లభించాడన్న వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

గురువారం వెలికితీసిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. మాచర్ల అఖిల్, ఆశీష్ మంథా, శివప్రకాశ్ వర్మల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమారులు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
విహారయాత్రకు వెళ్లి బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గల్లంతైన మిగితా 11 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications