హోం మంత్రి అనిత ఇలాకాలో మరో కొత్త ఎయిర్పోర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ గా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఏపీ రాష్ట్రానికి రెక్కలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య కేంద్రాలలో కొత్త విమానాశ్రయాలకు కీలక అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించగా, మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిటికి భూసేకరణ టెండర్లు మరికొన్నింటికి సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. మొదట కాకినాడ జిల్లాలోని అన్నవరం తుని మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, రైతులు వ్యతిరేకించడంతో పాటు సాంకేతిక సమస్యల వల్ల ఆ ప్లాన్ లో మార్పు వచ్చింది.

అక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి డీపీఆర్
ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నక్కపల్లి మధ్యలో గోపాలపట్నం వద్ద ఎయిర్పోర్టును నిర్మించాలని భావించినా, ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. అయితే ఇటీవల మళ్ళీ ఎయిర్పోర్ట్స్ పైన జరిగిన చర్చలో తుని అన్నవరం మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన డి పి ఆర్ సిద్ధమవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
కాకినాడ సమీపంలో ఎయిర్ పోర్ట్ అవసరం ఇందుకే
కాకినాడ తో పాటు ఉప్పాడ అనకాపల్లిలోని నక్కపల్లి లో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్న కారణంగా ఎయిర్పోర్ట్ అవసరం ఉందని, ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలర్ మిట్టల్, ఎన్టిపిసి వంటి పరిశ్రమలు ఇక్కడికి రావడంతో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కాకినాడ జిల్లాలోని విమానాశ్రయం ఏర్పాటు చేయడం అవసరమని భావించి ఈ క్రమంలో దీని పైన దృష్టి సారిస్తున్నారు.
పాయకరావుపేట సమీపంలోనే ఎయిర్పోర్ట్ వస్తుందా?
తునికి వంద కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. గతంలో ఈ భూములు అనుకూలం పోవడంతో తుని ప్రతిపాదన రద్దయింది. ఇప్పుడు పాయకరావుపేట సమీపంలో నిర్మాణం పైన తిరిగి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. అదే గనుక జరిగితే మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటవుతుంది.
హోం మంత్రి ఇలాకాలో ఎయిర్ పోర్ట్.. సందిగ్ధానికి త్వరలోనే తెర
ఈ కొత్త ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వం హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర ఏర్పాటు చేస్తారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటు విశాఖపట్నం రాజమహేంద్రవరం కు మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం ఆయన పాయకరావుపేట దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు జరుగుతుందా? లేదా అన్న సందిగ్దానికి త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.
-
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications