మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్.. మరో 13 శాతం షాపుల కోత.. 566 దుకాణాల మూత...
ఏపీలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మద్యం విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించిన రోజే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం... 24 గంటల్లోనే మరో 50 శాతం ధరలను పెంచుతూ భారీ షాక్ ఇచ్చింది. అంటే మొత్తం ధర 75 శాతం పెంచేసింది. మద్య నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటించినా మందుబాబుల హంగామా ఏమాత్రం తగ్గకపోవడంతో విపక్షాలు విమర్శలకు దిగాయి. దీంతో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం షాపులను గతేడాది అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. 20 శాతం దుకాణాలు మూసేసింది. తాజాగా లాక్ డౌన్ తర్వాత పరిస్ధితుల నేపథ్యంలో మరో 13 శాతం షాపులను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటివరకూ మొత్తం 33 శాతం షాపుల మూసివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు. వాస్తవానికి ప్రభుత్వం ఏడాదికి 20 శాతం షాపుల చొప్పున తగ్గిస్తూ ఐదేళ్లలో మద్య నిషేధాన్ని సంపూర్ణం చేయాలని భావించినా తాజాగా లాక్ డౌన్ తర్వాత మందుబాబుల హంగామా, విపక్షాల విమర్శల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య 2934కి తగ్గిపోనుంది. గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి 4380గా ఉన్న మద్యం షాపులను 20 శాతం కోతతో 3500కి పరిమితం చేసిన ప్రభుత్వం... తాజాగా మరో 13 శాతం తగ్గించడంతో వాటి సంఖ్య మరింత తగ్గినట్లయింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే 43 వేల బెల్టు షాపులను తొలగించిన ప్రభుత్వం... 40 శాతం మేర బార్లను కూడా ఉపసంహరించుకుంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..!












Click it and Unblock the Notifications