వైఎస్సార్ మరణం, కరోనా విలయం -సీఎం జగన్ భావోద్వేగం -కొవిడ్ మృతులకు అసెంబ్లీ నివాళి -రూ.1000 కోట్లు
కరోనా విలయం మిగిల్చిన విషాదాన్ని, ఆత్మీయులను కోల్పోయి ఆయా కుటుంబాలు అనుభవించే క్షోభను, కొవిడ్ పరిస్థితుల వల్ల తలెత్తే నైరశ్యాన్ని అర్థం చేసుకోగలనని, ప్రాణం విలువ తనకు బాగా తెలుసని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రాణం విలువ తెలసుకాబట్టే వాటిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, విలయకాలంలో ప్రతి ఒక్కరికీ భరోసాగా ఉంటున్నానని తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కరోనా పరిస్థితులపై గురువారం సభలో మాట్లాడిన సీఎం జగన్.. తన తండ్రి దివంగత వైఎస్సార్ ను తలుచుకూంటూ భావోద్వేగానికి లోనయ్యారు..
ప్రాణం విలువ.. వైఎస్సార్ మృతి..
''మహానేత
వైఎస్
రాజశేఖర్రెడ్డి
మరణాన్ని
తట్టుకోలేక
ఎంతో
మంది
ప్రాణాలు
కోల్పోగా,
ఓదార్పుయాత్ర
చేసి
ప్రతి
కుటుంబాన్ని
పరామర్శించాను.
నాకు
ప్రాణం
విలువ
బాగా
తెలుసు.
అందుకే
వైఎస్సార్
తీసుకొచ్చిన
ఆరోగ్యశ్రీలో
ఇప్పుడు
విప్లవాత్మక
మార్పులు
చేశాం.
గడిచిన
రెండేళ్లలో
ప్రతి
ఒక్కరినీ
దృష్టిలో
పెట్టుుని
అడుగులు
వేశాం.
కరోనా
విలయంలో
ఆరోగ్యశ్రీని
మరింత
సమర్థవంతంగా
మెరుగుపర్చాం.
గ్రామాల్లో
వైఎస్సార్
విలేజ్
క్లినిక్లు
నిర్మిస్తున్నాం.
ప్రతి
2
వేల
మంది
జనాభాకు
ఒక
ఏఎన్ఎంను
నియమించాం.
ఫోన్
చేసిన
20
నిమిషాల్లో
అంబులెన్స్
వచ్చేలా
మార్పులు
చేశాం..''
అని
సీఎం
జగన్
పేర్కొన్నారు.
కొవిడ్ మృతులకు అసెంబ్లీ సంతాపం
కోవిడ్
మహమ్మారి
కారణంగా
ప్రాణాలు
కోల్పోయిన
వారికి
ఏపీ
అసెంబ్లీ
నివాళి
అర్పించింది.
ఈ
సందర్భంగా
సీఎం
జగన్
మాట్లాడుతూ
కొవిడ్
నిర్వహణ
కోసం
వైసీపీ
సర్కారు
చేపట్టిన
పనుల్ని
గుర్తుచేశారు.
ఒకేసారి
1180
అంబులెన్స్లను
ప్రారంభించడం
మొదలు,
ఏపీలో
నిత్యం
లక్షల
కొద్దీ
శాంపిళ్లను
పరీక్షిస్తున్నామని,
నాడు-
నేడు
కార్యక్రమంతో
ఆస్పత్రుల
రూపురేఖలు
మార్చామని,
ఏడాది
కాలంలోనే
ఏపీలో
150కి
పైగా
ల్యాబ్లను
అందుబాటులోకి
తెచ్చామని,
కరోనా
తొలి
వేవ్
లో
261
ఆస్పత్రుల్లో
చికిత్స
అందిస్తే..
సెకండ్
వేవ్లో
649
ఆస్పత్రుల్లో
వైద్యం
అందిస్తున్నామని,
ఇతర
రాష్ట్రాల్లో
చికిత్స
చేయించుకునేవారికి
కూడా
ఆరోగ్య
శ్రీ
అందిస్తున్నామని,
కొవిడ్
నియంత్రణకు
ఇప్పటికే
రూ.
2,229
కోట్లు
ఖర్చు
చేశామని,
తాజాగా
బ్లాక్
ఫంగస్
చికిత్సను
కూడా
ఆరోగ్యశ్రీలోకి
తీసుకొచ్చామని
సీఎం
జగన్
గుర్తుచేశారు.
కాగా,
కరోనాపై పోరుకు బడ్జెట్లో భారీగా..
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడానికి ముందు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ 2021-22లో కోవిడ్ కట్టడిపై కీలక అంశాలను చేర్చారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.1000 కేటాయించినట్లు బుగ్గన ప్రకటించారు. బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొత్తం రూ.13,840.44 కోట్ల కేటాయించగా, వాటిలో ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు, కోవిడ్పై పోరాటానికి రూ.1000 కోట్లు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్కు రూ.100 కోట్లు, శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.