Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలకృష్ణకు అసెంబ్లీ హెచ్చరిక - టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!!

ఏపీ శాసనసభా సమావేశాల ప్రారంభంలోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభ ప్రారంభం కాగానే చంద్రబాబు కేసుల వ్యవహారం పైన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం పైకి వెళ్లి నినాదాలు చేసారు. ఆ సమయంలో బాలకృష్ణ మీసాలు తిప్పటం తో మాటల యుద్దం మొదలైంది. ఆ తరువాత సమావేశమైన శాసనసభ బాలకృష్ణ కు హెచ్చరిక చేసింది. ముగ్గురు టీడీపీ సభ్యులను సమావేశాల వరకు... 15 మందిని ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.

సభలో గందరగోళం : ఏపీ శాసనసభలో గందరగళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం పైక పేపర్లు చింపారు. స్పీకర్ మానిటర్ ను ధ్వంసం చేయటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

AP Assembly Speaker Warns Nandamuri Balakrishna over his behvior in Assembly, TDP MLAs Suspedned

ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పటం పైన మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. సభలో కాదు సినిమాలో మీసాలు తిప్పాలని పేర్కొన్నాు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది. రెండు పక్షాల నుంచి సభ్యులు ముందుకు దూసుకొచ్చారు. దీంతో, గందరగోళం నడుమ స్పీకర్ సభను వాయిదా వేసారు. బాలయ్యకు పోటీగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడ గొట్టారు.

బాలయ్యకు హెచ్చరిక : బ్రేక్ తరువాత సమావేశమైన సభలో స్పీకర్ కీలక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ సభలో మీసాలు తిప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. శాసనసభా సంప్రదాయాలను ఉల్లంఘించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలకృష్ణ కు శాసన సభకు మొదటి తప్పుగా భావిస్తూ క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా వ్యవహరించాలని సభ హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.

సభ ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్ తో పాటుగా పయ్యావుల కేశవ్ ను ఈ సమావేశాల మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ సభ్యుల తీరు పైన మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు తీర్మానం ప్రతిపాదించారు. దీంతో, ముగ్గురిని సమావేశాలు మొత్తం.. మిగిలిన వారిని ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.

AP Assembly Speaker Warns Nandamuri Balakrishna over his behvior in Assembly, TDP MLAs Suspedned

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ : చంద్రబాబు కేసుల పైన చర్చించటానికి సిద్దంగా ఉన్నామని మంత్రి బుగ్గన సభలో ప్రకటించారు. బీఏసీ సమావేశంలో దీని పైన నిర్ణయిస్తే ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అయితే, బీఏసీకి వెళ్లకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సభ రెండో సారి వాయిదా పడటంతో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.

ఈ నెల 27వ తేదీ వరకు సభ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వెనుక అంశాలను సభ ద్వారా ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ రోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయటంతో, ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు కేసుల అంశాన్ని సభ మందుకు తీసుకొస్తుందా..లేక మరో రోజు నిర్ణయిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+