రామమందిరం కల సాకారం వేళ ఏపీలో బీజేపీ సంబరాలు- టపాసులు, స్వీట్లతో హంగామా...
విజయవాడ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇవాళ తొలి అడుగు పడుతున్న వేళ ఏపీలో బీజేపీ నేతలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా పార్టీ అజెండాలో ఉన్న రామమందిర నిర్మాణం సాకారం అవుతుండటంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలుచోట్ల కాషాయ నేతలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.

అయోధ్యలో రామమందిరానికి ప్రధాని భూమిపూజ నిర్వహిస్తున్న సందర్భంగా ఏపీలోనూ ప్రభుత్వం రామాలయాల్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తే భక్తులు సంతోషిస్తారని బీజేపీ యువమోర్చా నేత రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా నదుల వద్ద శ్రీరామ హారతులు ఇవ్వాలని కూడా కోరారు. ఆగస్టు 5వ తేదీ చరిత్రలో లిఖించదగిన రోజుగా మిగిలిపోతుందని రమేష్ నాయుడు తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కోదండ రామాలయంలో నిర్వహిస్తున్నట్లే కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు.
Recommended Video

-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications