పురందేశ్వరి నిర్ణయాలకు బ్రేకులు - తెర వెనుక..!!
ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల నుంచి మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒక్కరికే మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని భావించినా..శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక..నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ నేతలకు పురందేశ్వరి హామీ ఇవ్వటం లేదు. పురందేశ్వరి నిర్ణయాల కు బ్రేకులు పడుతున్నాయా. కేంద్ర పార్టీ ఏం చేస్తోంది.
మారుతున్న లెక్కలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా...ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయాలు జరగుతున్నాయి. పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీతో పాటుగా పలు రాజకీయ సమీకరణాలు తెర వెనుక పని చేసాయనే అభిప్రాయం ఉంది. పార్టీలో మూడు దశాబ్దాలుగా పని చేసిన శ్రీనివాసవర్మకు అనూహ్యంగా ఎంపీ సీటు ఇవ్వటంతో పాటుగా తొలి సారి గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. పురందేశ్వరి ఆ సమయం నుంచి పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నా...విధాన పరమైన నిర్ణయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బీజేపీ నేతల వినతి
ఏపీలో ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండటంతో పదవుల కోసం కమలం పార్టీ నేతలు పురందేశ్వరిని సంప్రదిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమకు ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే, కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉండటంతో..ఇక్కడ బీజేపీ నేతలు ఎలాంటి డిమాండ్లు బలంగా వినిపించలేక పోతున్నారు. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. పదవుల కోసం డిమాండ్ చేయలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు నామినేటెడ్ పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు.
బీజేపీకి ప్రాధాన్యత దక్కేనా
కొందరు ముఖ్య నేతలు పురందేశ్వరిని కలిసి తమకు పదవులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే, వారికి పురందేశ్వరి ఎలాంటి హామీ ఇవ్వటం లేదు. తాను ప్రతీ అంశాన్ని పార్టీ అధినాయకత్వానికి నివేదిస్తానని చెబుతున్నారు. ఏదైనా పదవులు కావాలంటే కేంద్ర నాయకత్వాన్ని కలవాలని సూచిస్తున్నారు. టీటీడీ బోర్డుతో సహా రాష్ట్ర స్థాయిలో పదవుల విషయంలో చంద్రబాబుకు సిఫార్సు చేయటానికి పురందేశ్వరి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. మూడు పార్టీలు కూటమిలో ఉండటం..కేంద్రంలో టీడీపీ పాత్ర కీలకంగా మారిన సమయంలో..బీజేపీ నేతలకు ఏ స్థాయి పదవులు వస్తాయనేది చర్చగా మారుతోంది.
-
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications