AP Budget sessions 2021: అసెంబ్లీ నిరవధిక వాయిదా - ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దాదాపు రూ.2.11 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈ ఒక్కరోజు జరిపే ఈ బడ్జెట్ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మూడునెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పోను మిగతా తొమ్మిది నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అంతకుముందు కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు సభలనుద్దేశించి ఆన్లైన్ ద్వారా ప్రసంగిస్తారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం తర్వాత నేరుగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. కరోనా కారణంగా ఒక్కరోజుకే ప్రభుత్వం సమావేశాలను పరిమితం చేసింది. గతేడాది రెండు రోజులు నిర్వహించింది.
ఇదిలా ఉంటే ఆరు నెలలలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కూలిపోతోందన్న భయంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శలు సంధించారు. అయితే టీడీపీ విమర్శలకు వైసీపీ నాయకులు కూడా ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇక బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం