మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటే
ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను చర్చించనున్నారు.
కడప జైలు స్పెషల్ .. దేశంలోనే తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ..శంకుస్థాపన చేసిన హోం మంత్రి
Recommended Video
ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై , త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వివిధ సంస్థలకు జరిపిన భూకేటాయింపులపై చర్చించి క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది . ఇక అంతే కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై దాడి ఘటన, విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది.