టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై పాత కేసు తిరగతోడిన సీఐడీ-ఉద్యోగుల పీఆర్సీ పోరు వేళ
ఏపీలో ఉద్యోగసంఘాల పీఆర్సీ పోరు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మెడకు చుట్టుకుంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నారని ప్రభుత్వం అనుమతిస్తున్న అశోక్ బాబుపై ఏపీ సీఐడీ పాత కేసును తిరగతోడింది. తాజాగా అశోక్ బాబుపై సెక్షన్ 477A,465,420 కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
గతంలో అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ట్సాక్స్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు అశోక్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి గతంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించారు. గతేడాది ఆగస్టులో అశోక్బాబు కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో కూడా తమ దృష్టికి తీసుకురావాలని లోకాయుక్త తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.

అనంతరం అశోక్ బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గీతా మాధురి ఫిర్యాదుతో సీఐడీ తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో కూడా తాను గ్రాడ్యుయేట్ అంటూ టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యోగసంఘాల పీఆర్సీ పోరుకు అశోక్ బాబు సహకారం అందిస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసి టార్గెట్ చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications