అమరావతిలో చంద్రబాబు నివాసం జప్తు - కీలక మలుపు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తులో సీఐడీ మరో అడుగు ముందుకేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్..ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చటంలో అవినీతి వ్యవహారంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటుగా మాజీ మంత్రి నారాయణ..ఆయన సంబంధీకుల ఆస్తులపై సీఐడీ నివేదిక మేరకు అటాచ్ మెంట్ కు హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇదే వ్యవహారంలో న్యాయ పరంగా అనుమతి పొందేందుకు సీఐడీ అభ్యర్ధన పై నేడు అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణ చేయనుంది.
సీబీఐ విచారణ :అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి నగర ప్రణాళిక..రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదుల పైన సీఐడీ విచారణ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. గత ఏడాది మే నెలలో కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు అనుకూలంగా నాటి ప్రభుత్వం క్విడ్ ప్రో కో కు పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. లింగమనేని రమేష్ కు మేలు చేసేందుకే రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పులు జరిగాయాని నిర్ధారణకు వచ్చింది. లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది.

ప్రభుత్వ ఉత్తర్వులు:మాజీ సీఎం చంద్రబాబు, నారాయణ తో పాటుగా మరి కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసారని పేర్కొంది, తమ సొంత లాభం కోసం వాస్తవాలు దాచడం, వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం చేశారని సీఐడీ నివేదికలో వివరించింది. ఈ క్రమంలో చట్టాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాల ఉల్లంఘిన జరిగిందని వివరించింది. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా నేరపూరితమైన కుట్రతో మార్పులకు ఆమోదముద్ర వేశారని పేర్కొంది. లింగమనేని, హెరిటేజ్, ఇతరుల భూములు రాజధాని సిటీ మాస్టర్ప్లాన్ కింద సేకరించకుండా, ఇన్నర్ రింగ్ వారి భూములకు మరింత సమీపం నుంచి వెళ్లేలా ప్లాన్లు ఆమోదింపజేసుకున్నారని ఆరోపించింది. లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది.
కోర్టులో విచారణ:ఈ మేర కు హోంశాఖ ముఖ్యకార్యదర్శి సీఐడీకి అనుమతి ఇస్తూ జీవో జారీచేశారు. నారాయణ సంబంధీకుల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు న్యాయ పరంగా ఆదేశాలు పొందేందుకు సీఐడీ అవినీతి నిరోధక శాఖ కోర్టులో సీఐడీ దరఖాస్తు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్ మెంట్ కు ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన..తదుపరి వాదనలు వినేందుకు ఈ రోజు (బుధవారం) కు వాయిదా వేస్తూ న్యాయాధికారి నిర్ణయం తీసుకున్నారు. దీంతో, కోర్టులో ఈ రోజు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా అనేక మలుపులు తీసుకుంటోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications