Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు!

హైదరాబాదును మించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

గచ్చిబౌలిలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు

గచ్చిబౌలిలోని ఐ ఎస్ బి లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు కృత్రిమ మేధ విస్తరణ లక్ష్యాల పైన ప్రసంగించారు. 1990ల తర్వాత ఇంటర్నెట్ ప్రారంభమైందని, 1995 నుండి నుండి నాలెడ్జ్ ఎకానమీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలను పెట్టడం కోసం ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ని కలిసినట్టుగా చంద్రబాబు పేర్కొన్నారు.

AP CM Chandrababu says Amaravati will be developed in all aspects beyond Hyderabad standards

హైదరాబాద్ నగరానికి ఐటీ సంస్థలు, బడా విద్యాసంస్థలు తెచ్చా

హైదరాబాద్ లో కార్యాలయం పెట్టాలని తాను కోరగా, మొదట బిల్ గేట్స్ నిరాకరించారని, తాను చేసిన కృషి ఫలితంగా తర్వాత కాలంలో అది సాధ్యమైందన్నారు. ఐ ఎస్ బి, నల్సార్, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడంలో తాను సక్సెస్ అయ్యాను అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5000 ఎకరాల సేకరించామని తెలిపారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణానది తాగునీరు అందించినట్టు పేర్కొన్నారు.

1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి చంద్రబాబు కృషి

హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంలో తాను ఎంతో కృషి చేశానని, 1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి దోహదం చేశానన్నారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటులో తన కృషి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అనేక కారణాలతో 2004లో అధికారం కోల్పోయి, ఆ తర్వాత మళ్లీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్నారు. ఇక 2014 నుండి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు చంద్రబాబు.

ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో

కేవలం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెడితే ఎన్నికలలో గెలవలేము అనే గుణపాఠం 2019లో నేర్చుకున్నామన్నారు. 2019 నుండి 2024 మధ్య ఏపీ అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు విమర్శించారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అనేక రంగాలలో అగ్రస్థానంలో ఉందని, ఏపీని అన్ని విధాలుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని అన్నారు.

ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

గ్రీన్ ఎనర్జీరంగంలో ''దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్‌''

ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, అంతరిక్ష సాంకేతికతలు, డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా విస్తరిస్తున్నాయని వివరించారు. విద్యుత్ సమస్యలను అధిగమించి, మిగులు స్థాయికి తీసుకొచ్చామని, గ్రీన్ ఎనర్జీరంగంలో ''దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్‌'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ఏపీని తీర్చిదిద్ది హైదరాబాద్ ను మించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+