ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...
ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య మరింత తగ్గినట్లు ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 1901 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కేసుల్ని పరిశీలిస్తే.. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 397 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 313, గుంటూరు 295, చిత్తూరు 289, ప్రకాశం 104 ఉన్నాయి. అత్యల్ప కేసుల జాబితాలో శ్రీకాకుళం జిల్లా కేవలం 18 కేసులతో ముందుంది. ఆ తర్వాత అనంతపురంలో 21, విజయనగరం 59, కర్నూలు 63, కృష్ణా 74, కడప 85, విశాఖ 85 కేసులు నమోదయ్యాయి.వీటితో కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 8 వేలకు చేరింది.

Recommended Video
గత 24 గంటల్లో మృతుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కేవలం 10 జిల్లాల్లో 19 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో చిత్తూరులో నలుగురు, కడపలో ముగ్గురు, అనంతపూర్, తూర్పుగోదావరిలో ఇద్దరేసి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6606కు చేరింది.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్ల గడువు పెంపు-పూర్తి వివరాలివే..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications