ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు- మరోసారి 10 వేల మార్క్- మరో 81 మృతులు..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇవాళ నాలుగు లక్షలు దాటిపోయింది. వీరిలో 3 లక్షల మందికి పైగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం ఊరట కలిగించే అంశం.
ఏపీలో గత 24 గంటల్లో 10 వేల 526 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలో మరోసారి వెయ్యి కేసుల మార్క్ దాటింది. తూర్పున 1178, నెల్లూరులో 1151 కేసులు తేలాయి. అలాగే పశ్చిమగోదావరి 986, విశాఖ 896, అనంతపురం 833, చిత్తూరు 819 కేసులతో కొత్త కేసుల జాబితా టాప్లో నిలిచాయి. అట్టడుగున ఉందని భావిస్తున్న కృష్ణాజిల్లాలో తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ రోజుకు 200 కంటే తక్కువగా నమోదైన కేసుల సంఖ్య రెండు వారాల్లో తొలిసారిగా 400 దాటింది.

Recommended Video
మృతుల విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో 10 మంది, కడపలో తొమ్మిది మంది, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఎనిమిదేసి మంది, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖలో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పన చనిపోయారు. గుంటూరులో నలుగురు, విజయనగరంలో ఒక్కరు చనిపోయారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications