వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎటిఎంల వద్ద పోలీసుల అతిపై డిజిపి స్పందన
బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం ఉన్న సామాన్యులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతపురం ఘటనపై పోలీసు శాఖ తరపున ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు. బ్యాంకు వద్ద వ్యక్తిపై దాడి చేసిన డీఎస్పీ కమలాకరరావుపై విచారణకు ఆదేశించామని డీజీపీ తెలిపారు.
Comments
English summary
Andhra Pradesh DGP Samabasiva rao condemned attacks by the police on public at AT centres.
Story first published: Friday, December 2, 2016, 14:59 [IST]