ఏపీలో మరో డీఎస్సీ-నవంబర్ లో టెట్..! లోకేష్ ప్రకటన..!
ఏపీలో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి దాదాపు 16వేల మందిని టీచర్లుగా నియమిస్తున్న సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈసారి డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యామంత్రి లోకేష్.. ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు రాని వారు అధైర్యపడొద్దని సూచించారు.
ఈ ఏడాది నవంబర్ లో టెట్ పరీక్ష నిర్వహించబోతున్నామని, వచ్చే ఏడాది మరో డీఎస్సీ ఉంటుందని విద్యామంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గతంలో అత్యధిక డీఎస్సీలు నిర్వహించిన రికార్డు టీడీపీ ప్రభుత్వాలకే ఉందన్నారు. డీఎస్సీల ద్వారా 2 లక్షల మంది టీచర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. ఇప్పుడు కూడా మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందచేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. స్టార్టప్ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. అహర్నిశలు కష్టపడతాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మరోవైపు ఈ సభలో డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జీవిత స్థితిగతులపై వీడియోలు ప్రదర్శించారు. ఎంత కష్టపడి చదువుకుని... డీఎస్సీలో విజయం సాధించారని వీడియోల్లో విద్యాశాఖ వివరించింది. తమ వీడియోలు చూసుకుని పలువురు అభ్యర్థులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. యువతకు స్పూర్తినిచ్చేలా అభ్యర్థులపై ఈ వీడియోల్ని రూపొందించారు. కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా టీచర్లుగా రిక్రూటైన కొత్త టీచర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాలు అందచేశారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications