సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖా మంత్రి కారునే గుద్దేసిన మందుబాబులు...మినిస్టర్ జవహర్ సురక్షితం...
పశ్చిమ గోదావరి: మద్యం మత్తులో మంత్రిగారి కారునే గుద్దేసిన ఘనుల ఉదంతమిది. వారు గుద్దింది కూడా సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖా మంత్రి గారి కారే కావడం మరో విచిత్రం. అయితే ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బైటపడ్డారు.
ఎక్సైజ్ మంత్రి కెఎస్ జవహర్కి మందుబాబుల నుంచే ప్రమాదం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఓ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గురువారం రాత్రి దూబచర్లలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి జవహర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎక్సైజ్ మంత్రి కారును ఢీకొట్టిన వ్యక్తులు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు. మంత్రి కారు ప్రమాదం సమాచారం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైనవారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications