లడ్డూ వివాదంపై సర్కార్ తొలి చర్య-ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు..! సిట్ కు బదిలీ ?
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు నేరుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తొలి చర్య చేపట్టింది. లడ్డూ కల్తీకి కారణమైన కల్తీ నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు సంస్థ ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు టీటీడీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏఆర్ ఫుడ్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీకృష్ణ .. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఏఆర్ డెయిరీ సంస్థపై నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ తిరుమల లడ్డూ తయారీ కోసం పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లభించినట్లు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులు పెట్టారు.

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఆవు నెయ్యి సేకరణ విధానం, నాణ్యత అంశాలను సమీక్షించి కారణాలు గుర్తించినట్లు ఫిర్యాదులో టీటీడీ పేర్కొంది. కల్తీ నెయ్యి వల్లే లడ్డూలో సువాసన, రుచి లేకుండా పోయినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో నెయ్యి నాణ్యత పెంచాలని సరఫరాదారులకు నోటీసులిచ్చి హెచ్చరికలు చేశామని, అయితే మిగతా సంస్ధలు నాణ్యత పెంచినా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ మాత్రం తమ తీరు మార్చుకోలేదని తెలిపింది.
ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25 తేదీల్లోనూ, జూలై 4వ తేదీన...ఇలా మొత్తం నాలుగు రోజుల్లో రోజుకు ఓ ట్యాంకర్ చొప్పున నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ తెలిపింది. అయితే తిరుమలలోని ల్యాబ్లో కల్తీ నిర్ధారణ అవకాశం లేకపోవడంతో గుజరాత్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామన్నారు. జూలై 16, 23 తేదీల్లో టీటీడీకి అందిన రిపోర్టుల్లో ఏఆర్ ఫుడ్స్ పంపిన నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిపై స్పందించిన ఏఆర్ ఫుడ్స్ తప్పు ఒప్పుకోలేదన్నారు. కాబట్టి కల్తీ నెయ్యి పంపిణీ చేసి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా నేరానికి పాల్పడిందని నిర్ధారించినట్లు టీటీడీ తెలిపింది. దీంతో తిరుపతి పీఎస్ లో పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. వీటిని సిట్ కు బదిలీ చేయనున్నారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్లో కీలక మార్పులు, ఇక సులభంగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications