కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ ఏడుగురిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక అప్డేట్. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారం లో విచారణ సంస్థలు తమ నివేదికలు ఇచ్చాయి. నెయ్యి కొనుగోలు.. సరఫరా.. వ్యవస్థలో లోపాల పైన నివేదికలో స్పష్టం చేసాయి. ఇప్పటికే సిట్ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈవో సింఘాల్ ను బదిలీ చేసింది. మరి కొందరు అధికారుల పైనా చర్యలు తీసుకుంది. కాగా.. సిట్ నివేదికలో పేర్కొన్న మరో ఏడుగురు అధికారుల విషయంలోనూ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది.

తిరుమల లడ్డూ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీవైష్ణవీ డెయిరీతో కుమ్మక్కైన ఏడుగురు కార్మిక శాఖ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిట్‌ నివేదిక, ఆధారాలను అనుసరించి కార్మిక శాఖ ఫ్యాక్టరీస్‌ అండ్‌ బాయిలర్స్‌ శాఖ నిబంధనలు, ఏపీ పౌరసేవల ప్రవర్తనా నియమాలు- 1964, ఏపీసీఎస్‌ రూల్స్‌ 1991 అనుసరించి అభియోగాలు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలపై పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడిన శ్రీవైష్ణవీ డెయిరీకి టీటీడీ అధికారులతోపాటు ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖ అధికారులు సహకరించినట్టు వెల్లడయ్యింది.

రాజ్యసభకు షర్మిల - ఇక ఆ సీఎంతో కలిసి, రాహుల్ బిగ్ టాస్క్..!!
రాజ్యసభకు షర్మిల - ఇక ఆ సీఎంతో కలిసి, రాహుల్ బిగ్ టాస్క్..!!
ap-government-initiated-disciplinary-action-against-seven-officials-based-on-findings-of-the-sit-in

ప్రభుత్వం తాజా చర్యలతో

కాగా.. తనిఖీల సమయంలో లోపాలను గుర్తించకుండా ఈ అధికారులు డెయిరీకి సహకరించినట్లు తేలింది. పైగా డెయిరీ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో తనిఖీలు చేయకుండా కొనసాగింపు ఇచ్చే విషయంలో పూర్తిగా సహకరించారు. ఇందుకు డెయిరీ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో డెయిరీకి సహకరించిన ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ్‌సగా పని చేసి రిటైర్‌ అయిన కర్రి పరమేశ్వరరావు, విజయవాడ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ, ప్రస్తుతం ఏలూరులో బాయిలర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎంవీఎల్‌ నరసింహరాజు, నెల్లూరులో బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న టి.సుష్మా, తిరుపతిలో బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న పి.రాంబాబు, చిత్తూరు, నెల్లూరులో బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎన్‌.శివశంకరరెడ్డి, నెల్లూరులోని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన బి.రమేశ్‌బాబుపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ అభియోగాలకు సంబంధించి పది రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+