Cotton Candy: ఏపీలో పీచు మిఠాయిపై నిషేధం ?
ఇన్నాళ్లూ పిల్లల్ని తన రుచితో ఊరించిన పీచు మిఠాయి ఇకపై అదృశ్యం కాబోతోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి కారణం ఇందులు వాడుతున్న కృత్రిమ రంగులే. పీచు మిఠాయి తయారీలో సింథటిక్ రంగుల వాడకం కారణంగా క్యాన్సర్ తో పాటు పలు ప్రమాదకర రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందనే నివేదికలు ఏపీ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో తయారు చేస్తున్న పీచు మిఠాయి శాంపిల్స్ ను పరీక్షలకు పంపాలని నిర్ణయించింది.
సింథటిక్ తో పాటు ఇతర అనుమతి లేని రంగుల్ని పీచు పిఠాయి తయారీలో వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీచు మిఠాయి తయారీ కేంద్రాల నుంచి శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించింది. దీంతో వీరు పీచు మిఠాయి శాంపిల్స్ సేకరణ చేయనున్నారు. వీటిని ల్యాబ్స్ కు పంపి ప్రమాదకర రంగులు వాడుతున్నారో లేదో నిర్ధారించబోతున్నారు.

ప్రస్తుతం పీచు మిఠాయి తయారీలో వాడుతున్న రంగులు క్యాన్సర్ కారకంగా తేలిందని ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ ఇవాళ తెలిపారు. దీంతో శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పరీక్షల ఫలితాలు రావాలంటే నెల రోజుల సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు. ఫలితాలు వచ్చాక వీటిని పరిశీలించి పీచు మిఠాయిపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications