Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెథాయ్ తుపానుతో అలర్ట్.. సహాయకచర్యలకు సిద్ధం : చినరాజప్ప

Recommended Video

    Cyclone Pethai: Andhra Pradesh On High Alert | పెథాయ్‌ ఎఫెక్ట్ తో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం!!

    కాకినాడ : పెథాయ్ తుపానుతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉందని తెలిపారు హెం మినిస్టర్ చినరాజప్ప. తూర్పుగోదావరి జిల్లాలోని 14 మండలాలపై తుపాను ప్రభావం ఉండే ఛాన్సుందని తెలిపారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసరాలతో పాటు అవసరమైన అన్నింటినీ సిద్ధంగా ఉంచామన్నారు. తుపాను తీవ్రత ప్రకారం డెబ్బైకి పైగా నివాసిత ప్రాంతాల నుంచి జనాలను తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

    అటు హెలికాప్టర్లు, భద్రతా బలగాలు సహాయకచర్యల కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెథాయ్ తుపాను దిశ మారుతోందని.. కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని ప్రకటించారు.

    ap government officials alert on pethai storm

    17 తుపాను ప్రభావిత మండలాల్లో సహాయక చర్యలు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల జాడ కనిపించడం లేదని సమాచారం వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమై వారిని సముద్రంలో ఉన్న రిగ్ దగ్గరకు సురక్షితంగా తరలించామని చెప్పారు. జిల్లాలో 60 వైద్య శిబిరాలు, 82 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+