కరోనా సెకండ్ వేవ్ : భారీ నియామకాలకు జగన్ గ్రీన్సిగ్నల్- భర్తీ చేసే ఉద్యోగాలివే
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు వెయ్యి అదనపు కేసుల చొప్పున పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్ధితి. దీంతో గతేడాది ప్రారంభించి ఆ త తర్వాత పట్టించుకోని కోవిడ్ ఆస్పత్రులను తిరిగి దుమ్ముదులపడంతో పాటు భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో ఈ నియమాకాలు పూర్తి చేయడం ద్వారా కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

ఏపీలో తాజా కరోనా పరిస్ధితి ఇదే
ఏపీలో కరోనా కేసుల విజృంభణ ఆదివారం కూడా కొనసాగింది. నిన్న ఒక్క రోజు 12 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కేసుల కట్టడికి ఉన్న అన్నిమార్గాలను అన్వేషిస్తోంది. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మన రాష్ట్రం నుంచి రాకపోకలపై ఆంక్షలు కూడా విధిస్తున్న పరిస్ధితి. దీంతో తక్షణం ఏదో రకంగా కేసుల్ని నియంత్రించక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. దీంతో ఓవైపు టెస్టుల సంఖ్య పెంచుతూనే మరోవైపు కోవిడ్ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు వీలుగా అదనపు సిబ్బంది నియామకానికి సిద్దమైంది.

భారీగా నియామకాలు
కోవిడ్ రెండో దశ ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో అదనపు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు ఇచ్చారు. ఇకపై కోవిడ్తో బాధపడుతున్న రోగులకు పూర్తి స్ధాయిలో వైద్యసేవలు అందించేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

నియమించే పోస్టులివే
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో 1170 స్పెషలిస్టు డాక్టర్లు, 1170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 300 మంది అనస్తీషియా టెక్నీషియన్ల నియమకానికి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 300 మంది ఎమ్ఎన్వోలు, 300 స్వీపర్ల నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో కొరత భారీగా తీరనుందని అంచనా వేస్తున్నారు.

తాత్కాలిక నియామకాలు
ఈ అదనపు పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదిక మీదే ప్రభుత్వం నియమించబోతోంది. వీరికి ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేక వేతనాలలు చెల్లించి వీరి సేవల్ని పొందనుంది. గతంలోనూ కోవిడ్ సందర్భంగా ప్రభుత్వం ఇలాగే భారీ ఎత్తున సిబ్బందిని నియమించుకుంది. ఈసారి కూడా అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడం ద్వారా ఆరు నెలల్లో పరిస్ధితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది. జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రుల వారీగా ఈ నియామకాలు జరిగే అవకాశముంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications