ఎపిలో...జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు:మంత్రి కాల్వ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు చేస్తామని గతంలో సిఎం ఇచ్చిన హామీ నేపధ్యంలో ఈ నిధులు ప్రధానంగా ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్ లో జర్నలిస్టులకు నిధుల కేటాయింపు జరపకపోవడంపై పాత్రికేయులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడం...మరోవైపు తెలంగాణా ప్రభుత్వం తమ బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఎపి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఎపిలో పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్నుంచో పాత్రికేయులు కోరుతున్నవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిపింది. ఈ విషయాన్నిరాష్ట్ర సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్పై ధన్యవాదాలు తెలిపే సమయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారని తెలిపారు.
అలాగే జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లు ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిసింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications