ఎపిలో...జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు:మంత్రి కాల్వ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు చేస్తామని గతంలో సిఎం ఇచ్చిన హామీ నేపధ్యంలో ఈ నిధులు ప్రధానంగా ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్ లో జర్నలిస్టులకు నిధుల కేటాయింపు జరపకపోవడంపై పాత్రికేయులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడం...మరోవైపు తెలంగాణా ప్రభుత్వం తమ బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఎపి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఎపిలో పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్నుంచో పాత్రికేయులు కోరుతున్నవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిపింది. ఈ విషయాన్నిరాష్ట్ర సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్పై ధన్యవాదాలు తెలిపే సమయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారని తెలిపారు.
అలాగే జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లు ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిసింది.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications