AP Govt: స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులు ఎప్పటినుంచో అడుగుతున్న ఓ కీలక డిమాండ్ పై ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీలో వివిధ సమస్యలతో ఇప్పటికే తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కుంటున్నప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం (ap govt) నుంచి స్పందన లేకపోవడంతో అసంతృప్తిగా కనిపిస్తున్న స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు ఇవాళ ఓ విషయంలో మాత్రం గుడ్ న్యూస్ లభించింది. ఇవాళ సచివాలయాల శాఖ మంత్రి డీవీవీ స్వామి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
అమరావతి సచివాలయంలో ఇవాళ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఉద్యోగుల రేషనలైజేషన్, పదోన్నతులు, మూడంచెల వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణకు ప్రతి జిల్లాకొక అధికారి, ప్రతి మండలానికొక అధికారి చొప్పున డిప్యూటేషన్ పై నియామకం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి స్వామి కీలక ప్రకటన చేశారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకనుగుణంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది పనిచేయాలని కోరారు. సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో సంతృప్తి పెంపే లక్ష్యంగా మెరుగైన సేవలందించాలని వారికి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications