ఎల్ఆర్ఎస్ పధకం సమయం పొడిగింపు - వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కొనసాగింపు..!!
పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడువును 2022 మార్చి 31 తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. 2020 ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా 2021 సెప్టెంబరు 31 తేదీలోగా అందుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువు పెంచుతూ పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ సిబ్బంది అగ్రిగోల్డ్ భూముల్లో జగనన్న స్మార్ట్ టౌన్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాల్లో నిమగ్నమైనందున అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది.
ఎల్ఆర్ఎస్ 2020 పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు గడువు ముగిసే నాటికి 43,753 దరఖాస్తులు వచ్చినట్టు తెలియచేసింది. ఇప్పటి వరకూ అందులో 14,218 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించగలిగినట్టు వెల్లడించింది. ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు నిర్దేశిత ప్రామాణిక విధానాన్ని పాటించాలని సూచిస్తూ అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. గత కొద్ది నెలలుగా అధికారులు జగనన్న కాలనీల గుర్తింపులో బిజీగా ఉన్నారు.

రాష్ట్రంలో నగర కమిషనర్లు.. అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల వైస్ ఛైర్మన్లు..మున్సిపల్ కమిషనర్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంతో పాటుగా అనధికార లేఅవుట్లను గుర్తించే కార్యక్రమాన్ని సమాంతరంగా చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దరఖాస్తు దారులకు నోటీసులు పంపటంతో పాటుగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించాలి.
Recommended Video
అర్బన్ లోకల్ బాడీస్..ఉడాలు..మెట్రో పాలిటిన్ నగర సంస్థలు..మున్సిపల్ కమీషనర్లు ప్రతీ వారం సమీక్ష నిర్వహించాలి. పెండింగ్ లో ఉన్న 29 వేల 535 దరఖాస్తుల ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి డిసెంబర్ 15 లోగా లేఖలు పంపాలని ఆదేశిచింది. రాష్ట్ర స్థాయిలో సీడీఎంఏ, టీఐసీపీ 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించి గడువు లోగా లేఅవుట్ల క్రమబద్దీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications