భారీగా ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం, వారికే ఛాన్స్ - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో విద్యా శాఖ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కళాశాల విద్యా శాఖను ఉన్నత విద్య కమిషనరేట్గా మార్చారు. సాంకేతిక విద్యా శాఖను రద్దు చేశారు. దానికి సంబంధించిన సిబ్బంది, ఆస్తులను ఉన్నత విద్యలోకి బదిలీ చేశారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అదే విధంగా టీచర్ల బదిలీ ల పైనా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కొత్త డీఎస్సీ నిర్వహణ పరిగణలోకి తీసుకుంటూ ఈ బదిలీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణల అమలుకు సిద్దమైంది. ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు పడింది. ఇటీవల క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా శాఖల పునర్ వ్యవస్థీ కరణ దిశగా అడుగులు పడ్డాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పేరును మార్చారు. ఆయా అంశాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టరేట్ను నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్గా మార్చారు. ఈ కమిషనరేట్ పరిధిలోకి నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, ఓంక్యాప్లు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో మార్పునకు అనుగుణంగా జిల్లాల్లో ఉండే ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాధి కారిగా మార్చారు. కమిషనరేట్ ఏర్పాటుతో ఉన్నత విద్యామండలి అధికారాలు పరిమితం కాను న్నాయి. ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత మండలిదే. అయితే అడ్మిషన్లన్నీ ఉన్నత విద్య కమిషనరేట్ చేపడుతుంది. ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు మండ లి చూస్తోంది. ఇకపై ఆ బాధ్యత కమిషనరేట్దే. కరిక్యులమ్లో మార్పులు, వర్సిటీల ర్యాంకులు, ఇతర అకడమిక్ అంశాలకు మండలి పరిమితం కానుంది.

అదే విధంగా, ఉపాధ్యాయ బదిలీలు మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. ఈ ఏడాది సుమారు 20వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. బదిలీల్లో ఇచ్చే సర్వీస్ పాయింట్లకు గతేడాది తరహాలో డెసిమల్స్లోనే పాయింట్లు ఇవ్వనున్నారు. పలు అంశాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని విద్యాభవన్లో సమావేశం నిర్వహించారు. టెన్త్ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల బాధ్యతల కేటాయింపుపై ప్రధానంగా చర్చ జరిగింది. చాలామంది టీచర్లను దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు కేటాయించారని, వాటిని మార్చాలని ప్రతినిధులు కోరారు. బాగా ఎక్కువ దూరం కేటాయించిన వారిని మారుస్తామని అధికారులు చెప్పారు. 50 శాతంపైగా టీచర్లకు బాధ్యతలు ఇచ్చిన 79 పాఠశాలల్లో నిబంధనల మేరకు మార్పులు చేయనున్నారు. జూన్లో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పుడు అన్ని తరగతుల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని అధికారులు సూచించారు.
-
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!! -
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..













Click it and Unblock the Notifications