గౌతమిపుత్ర శాతకర్ణిపై కేబినెట్ చర్చ: లేచి వెళ్లిపోయిన చంద్రబాబు..
తమ మధ్య ఉన్న బంధుత్వం ప్రభావం కేబినెట్ చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన ఈ భేటీలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' పన్ను మినహాయింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ చర్చ సందర్బంగా సీఎం చంద్రబాబు సమావేశం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
'గౌతమిపుత్ర శాతకర్ణి' హీరో బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం, పైగా బాలకృష్ణకు చంద్రబాబుకు బంధుత్వం ఉండటంతో.. ఆ ప్రభావం చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

సెక్షన్-8 ప్రకారం సినిమాకు పన్ను రాయితీనిస్తూ కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
* పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్టీ కంపెనీకి రూ.95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు ఆమోదముద్ర
* అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
* ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయం.
*గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్లో వినోదపన్ను మినహాయింపు
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications